యాప్నగరం

‘జనసేనపై కుట్ర.. పొరుగు రాష్ట్రాల నుంచి అల్లరిమూకలు..’

జనసేన పార్టీపై ప్రజలు చూసిస్తున్న ఆదరణ చూసి భయపడి కొన్ని స్వార్థపూరిత శక్తులు దుష్ట పన్నాగాలు పన్నుతున్నాయి. పోలీసులు ఇటీవల పసిగట్టిన కొన్ని ఉదంతాలే దీనికి తార్కాణం.

Samayam Telugu 26 Apr 2018, 8:55 pm
జనసేన పార్టీపై ప్రజలు చూసిస్తున్న ఆదరణ చూసి భయపడి కొన్ని స్వార్థపూరిత శక్తులు దుష్ట పన్నాగాలు పన్నుతున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. పోలీసులు ఇటీవల పసిగట్టిన కొన్ని ఉదంతాలే దీనికి తార్కాణమని పేర్కొంది. తమపై, తమ పార్టీపై కుట్ర జరుగుతోందంటూ జనసేన గురువారం (ఏప్రిల్ 26) ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడల్లా ఏదో ఒక కుట్ర జరుగుతోందని జనసేన ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి సదరు ప్రకటనలో పేర్కొన్నారు.
Samayam Telugu pawan2


నిఘా వర్గాల హెచ్చరికతో పవన్ కళ్యాణ్ ఆగిపోయారని.. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో తన పర్యటనను వాయిదా వేసుకున్నారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ‘తుని రైలు విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడి జనసేన పార్టీకి చెడ్డపేరు తీసుచ్చేలా కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించి సమాచారం అందించాయి. పక్క రాష్ట్రాల నుంచి కిరాయి మూకలను తెచ్చి అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ఏప్రిల్ 21, 22, 23 తేదీల్లో శెట్టిపల్లిలో భూసేకరణ సమస్య, చిత్తూరు పట్టణంలో హైవే రోడ్డు నిర్మాణ బాధితులను కలవడానికి పవన్ ఖరారు చేసుకున్న పర్యటనను వాయిదా వేశారు. కామన్వెల్త్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన తెలుగు తేజం, గుంటూరు జిల్లావాసి వెంకట రాహుల్‌కు ఏప్రిల్ 30న సన్మాన కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధినేత భావించారు. కానీ, నిఘా వర్గాల హెచ్చరికతో ఈ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

కుట్రలతో జనసేనానిని ఆపలేరు..
ప్రజల వద్దకు వెళ్లాలన్న తన సంకల్పాన్ని ఎవరూ వమ్ము చేయలేరని పవన్ పేర్కొన్నారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాల్లో సుదీర్ఘ పర్యటనల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిలో టీడీపీ వైఫల్యం, ప్రత్యేక హోదా సాధన తదితర అంశాలతో ప్రజల్లోకి వెళ్లడానికి పవన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. రెండు, మూడు వారాల్లో జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.