యాప్నగరం

బంజారాహిల్స్: ఏకే 47తో కాల్చుకున్న కానిస్టేబుల్

రిటైర్డ్‌ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా సని చేస్తున్న కానిస్టేబుల్‌ ఏకే 47 గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బంజారాహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌లో శుక్రవారం (జులై 6) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 7 Jul 2018, 1:50 pm
రిటైర్డ్‌ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా సని చేస్తున్న కానిస్టేబుల్‌ ఏకే 47 గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బంజారాహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌లో శుక్రవారం (జులై 6) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. బలవన్మరణానికి పాల్పడిన కానిస్టేబుల్‌ను కిషోర్‌గా గుర్తించారు.
Samayam Telugu Kishore suicide


తోటి సిబ్బంది సాయంతో రిటైర్డ్‌ డీజీ కుటుంబ సభ్యులు కిషోర్‌ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కానీ, బుల్లెట్‌ ఛాతీ భాగంలో దూసుకెళ్లడంతో 24 గంటలు గడిస్తేగానీ అతడి ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యాయత్నానికి ఉపయోగించిన ఏకే 47తో గన్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే కిషోర్ బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.