యాప్నగరం

కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం

ప్రభుత్వ కళాశాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

Samayam Telugu 21 Dec 2016, 11:52 am
ప్రభుత్వ కళాశాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శానసమండలలితో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానం ఇచ్చారు.
Samayam Telugu contract lecturers will be regularised ts deputy cm
కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తాం


రాష్ట్రంలో మూడువేలకు పైచిలుకు ఒప్పంద అధ్యాపకులు పనిచేస్తున్నారని..అయితే వాళ్లలో కొంతమంది హైకోర్టుకు వెళ్లినందున ఈ క్రమంలోనే క్రమబద్దీకరణ ఆగిపోయిందని మంత్రి పేర్కొన్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే లెక్చరర్ల ఉద్యోగాలను పర్మినెంట్ ప్రక్రియ వేగవంతం చేస్తామని సభలో వెల్లడించారు.

కాంట్రాక్ట్ లెక్చరర్ల జీతాలు పెంచినట్లు చెప్పిన మంత్రి కడియం...అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని..సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని..విద్యార్థుల హాజరుశాతం పెరిగిందని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.