యాప్నగరం

టీటీడీ ఛైర్మన్ పదవిపై రగడ..శివస్వామిపై యాదవ సంఘాల ఫైర్

టీటీడీ ఛైర్మన్ పదవిపై ఏపీలో రగడ కొనసాగుతోంది. పుట్టా సుధాకర్ యాదవ్‌ నియామకాన్ని శైవక్షేత్ర పఠీధాపతి శివస్వామి వ్యతిరేకించడంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును వ్యతిరేకిస్తూ... అమరావతిలో భారీ ఆందోళన చేపట్టారు

Samayam Telugu 15 Apr 2018, 1:32 pm
టీటీడీ ఛైర్మన్ పదవిపై ఏపీలో రగడ కొనసాగుతోంది. పుట్టా సుధాకర్ యాదవ్‌ నియామకాన్ని శైవక్షేత్ర పఠీధాపతి శివస్వామి వ్యతిరేకించడంపై యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరును వ్యతిరేకిస్తూ... అమరావతిలో భారీ ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యాదవులు... తాళ్లాయపాలెంలో ఉన్న శైవక్షేత్రాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడే మోహరించిన పోలీసులు... ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
Samayam Telugu Yadavas Protest


ముట్టడి ప్రయత్నం ఫలించకపోవడంతో... యాదవ సంఘాలు అక్కడే దిష్టి బొమ్మను దగ్థం చేసేందుకు ప్రయత్నించారు. మళ్లీ ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమించడాన్ని శివస్వామి తప్పుబట్టారు. దీనిపైనే యాదవ సంఘాలు నిరసన తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.