జేఎన్యూ విద్యార్ధి సంఘం నేత కన్నయ్యకుమార్ విజయవాడ పర్యటన పై వివాదం రాజుకుంది. కన్నయ్య పర్యటనను అడ్డుకుంటామని బీజేవైఎం ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన్ను విజయవాడలో అడుగుపెట్టనివ్వమని వార్నింగ్ ఇచ్చింది. దీనిపై స్పందించిన వాపక్షాలు ..కన్నయ్యను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్య సభను నడిపించి తీరుతామని సీపీఐ,సీపీఎం పార్టీలు ప్రకటన విడుదల చేశాయి. కన్నయ్య సభ కోసం విజయవాడలోని గవర్నర్ పేట ఐవీ ప్యాలెజ్ లో నిర్వహిస్తామని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు. ఇదలా ఉండగా సభ నిర్వహణ కోసం వామపక్షాలు ఇప్పటి వరకు తమ అనుమతి కోరలేదన్న పోలీసులు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కన్నయ్య సభ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కన్నయ్య విజయవాడ పర్యటనపై వివాదం
విజయవాడ: కన్నయ సభపై వామపక్షాలు - బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
TNN 24 Mar 2016, 11:55 am