యాప్నగరం

శిరీష కేసులో పోలీసుల కస్టడీకి నిందితులు

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు నిందితులు రాజీవ్, శ్రవణ్ లను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు

Samayam Telugu 26 Jun 2017, 2:45 pm
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు నిందితులు రాజీవ్, శ్రవణ్ లను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు రెండు రోజులపాటు పలు కోణాల్లో వీరిని విచారించనున్నారు. శిరీష, రాజీవ్, శ్రవణ్ లు కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ని కలిసి ఈనెల 12 అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. 13న తెల్లవారు జామున శిరీష రాజీవ్ కు చెందిన స్టూడియోల్ ఆత్మహత్య చేసుకుంది. ఆ మరుసటి రోజే ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ కేసు పలు మలుపులు తిరిగింది.
Samayam Telugu convicts of sirisha murder case taken into police custody
శిరీష కేసులో పోలీసుల కస్టడీకి నిందితులు


ఈ కేసులో ఇప్పటికే రాజీవ్, శ్రవణ్, నందు, నవీన్ లపై కేసులు నమోదయ్యాయి. శిరీష ఆత్మహత్య తర్వాత పలు ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియోలో రాజీవ్ తాను ఎంతగా ఇష్టపడుతుందో వెల్లడించింది. రాజీవ్ ప్రేయసి తేజస్వినీ బెదిరించడానికి శిరీష... నందు, నవీన్ ల సాయం తీసుకున్నట్లు ఆడియోల్లో బయటపడింది.

అయితే శిరీషను పథకం ప్రకారమే హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.