యాప్నగరం

క్షణికావేశం.. దంపతుల ఆత్మహత్య

క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో భార్యాభర్తలు మృతిచెందారు. జనగామ పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 1 Jul 2018, 1:28 pm
క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాలతో క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో భార్యాభర్తలు మృతిచెందారు. జనగామ పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన శేఖర్‌కు, లింగాలఘనపురం మండలం కుందారం గ్రామానికి చెందిన శారదతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం బాగానే సాగింది. అయితే కొన్నిరోజుల నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్ధలతో కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శారద శుక్రవారం (జూన్ 29) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Samayam Telugu janagama


తమ కుమార్తె మృతికి భర్త శేఖర్‌, అతని కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ శారద తల్లిదండ్రులు అదే రోజు రాత్రి శేఖర్‌ ఇంటిపై దాడి చేశారు. దీంతో భయపడిన శేఖర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం (జూన్ 30) ఉదయం శేఖర్‌ మృతి చెందాడు.

ఒకే రోజు వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. శారద మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. శేఖర్‌ మృతదేహానికి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.