పెళ్లయి ఏడేళ్లయినా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు. దీంతో వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ లో నివసిస్తున్నారు పాండు (32), కవిత (27). కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి పెళ్లయి ఏడేళ్లైంది. ఇప్పటివరకు పిల్లల్లేరు. ఇక తమకు పిల్లలు కలగరేమో అని వారు డిప్రెషన్ కు గురయ్యారు. గురువారం రాత్రి పురుగుల మందు తాగారు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఎంతసేపైనా వారు ఇంటి తలుపులు తీయకపోవడంతో... స్థానికులు అనుమానం వచ్చి ఇంట్లోకి చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పిల్లలు లేరన్న బాధతో... ఆత్మహత్య
పెళ్లయి ఏడేళ్లయినా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు.
TNN 2 Sep 2016, 3:34 pm