యాప్నగరం

రంగారెడ్డి జిల్లా విషాదం.. కుమార్తెతో పాటు దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. కూతురితో సహా దంపతుల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే ప్రాణాలే కారణమా..

Samayam Telugu 24 Nov 2018, 9:49 am
రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది. బాలాపూర్ మండలం కుర్మల్ గూడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి భార్యాభర్తతో పాటూ కూతురు ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులు హనుమంతు, చంద్రకళ, మంజులగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu suicide.


కుటుంబ కలహాల వల్లే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు హనుమంతుకు ఇద్దరు భార్యలట. సోమవారం మొదటి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు స్థానికులు చెబుతున్నారు.భయంతోనే రెండో భార్య, కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.