యాప్నగరం

కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆదేశాలు

ప్రొఫెసర్‌, రచయిత కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా పేర్కొంటూ కోర్టు మల్కాజిగిరి పోలీసులకి ఆదేశాలు..

TNN 10 Oct 2017, 11:12 pm
ప్రొఫెసర్‌, రచయిత కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా పేర్కొంటూ మల్కాజిగిరి కోర్టు మల్కాజిగిరి పోలీసులకి ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కంచ ఐలయ్య రాసిన ఓ పుస్తకంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నాగరాజు అనే దళిత యువకుడు మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు.
Samayam Telugu court directs cops to file case against kanche ilaiah
కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆదేశాలు


నాగరాజు ఫిర్యాదుని విచారణకు స్వీకరించిన కోర్టు.. కంచ ఐలయ్యపై సెక్షన్‌ 153ఏ, 153బీ, 295ఏ, ఐపీసీ 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకి ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.