యాప్నగరం

చింతమనేనిపై చర్యలేవి.. బాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

చంద్రబాబుకు చింతమనేని ఆగడాలు కనిపించడం లేదా.. కేసు నమోదై రెండు నెలలవుతున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు.

Samayam Telugu 26 Nov 2018, 1:15 pm
ప్రజాస్వామ్యం పేరు చెప్పే చంద్రబాబుకు.. సొంత పార్టీ ఎమ్మెల్యే చింతమనేని చేస్తున్న ఆగడాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. చింతమనేని కేసులు నమోదైనా చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. ఈ మేరకు రామకృష్ణ చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. ఆ లేఖలో.. ప్రజాస్వామ్యం కోసం దేశమంతా తిరిగే చంద్రబాబుకు చింతమనేని చేస్తున్న అరాచకాలు తెలియదా అని ప్రశ్నించారు. విజిలెన్స్, మీడియా, పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులపై దాడి చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో చట్టం ఉందా? లేదా అని ప్రశ్నించారు.
Samayam Telugu cpi.


చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రెండు నెలలు దాటిపోతోందని.. అయినా ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవన్నీ తెలియదా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే చింతమనేని అరెస్ట్ చేయాలన్నారు. ఆయన ఆగడాలపై, అక్రమాలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామకృష్ణ.

తరచూ వివాదాల్లో ఉంటున్న చింతమనేనికి వ్యతిరేకంగా సీపీఐ పోరుబాట పట్టింది. ఓ కార్మికుడిపై దాడి చేసిన ఆరోపణలపై ప్రభాకర్‌పై కేసు నమోదు కాగా.. ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఆందోళనలు చేపట్టింది. మూడు రోజుల క్రితం కూడా విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాలుగున్నర ఏళ్ళుగా చింతమనేని అరాచకాలను చంద్రబాబు సమర్దిస్తూనే ఉన్నారని నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు తాజాగా కె.రామకృష్ణ లేఖ రాశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.