తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం)పై ఫైర్ అయ్యారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేపడితే ముఠాలతో అక్కడా ఆ పార్టీ నేతలు నానా హంగామా చేశారని సీఎం మండిపడ్డారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని సీతారాం తన గ్యాంగ్ తో అక్కడ రైతులను రెచ్చగొట్టే పనిలో ఉంటే తాను లాఠీ చార్జీకి ఆదేశించానని కేసీఆర్ గుర్తు చేశారు. సీపీఎంకు దిక్కుమాలిన స్ట్రాటజీలు ఉంటాయని, జనాన్ని చంపడమే దాని రహస్య ఏజెండా అని ఆయన దుయ్యబట్టారు. సీపీఎం సూది పార్టీగా దబ్బనం పెట్టుకొని తిరుగుతూ ఉంటుందని...మంచి చేసే ప్రభుత్వాలను ఆ దబ్బనాలు, సూదులతో గుచ్చడమే ఆ పార్టీ పని తప్ప వేరే పనేమీ ఉండదని కేసీఆర్ ఆరోపించారు. భూసేకరణకు వ్యతిరేకంగా ఒకే ఒకపార్టీకి సంబంధించిన లాయర్లు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు వేశారని ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
భూసేకరణ బిల్లును ప్రధానమంత్రితో చర్చించాకే రూపొందించామని, దీని వల్ల ఏ రైతుకు ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మారాలని, వాళ్లు సృష్టించే అడ్డంకులు అధిగమించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి...జలకళతో తెలంగాణను పచ్చగా మారుస్తామని, వచ్చే యేడాది చివరికల్లా పంటలు పండించి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు.
అసెంబ్లీలో 2013 భూసేకరణ సవరణ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కేసీఆర్ పాల్గొన్నారు. భూ సేకరణ చేపట్టకుంటా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టులు కట్టలేదని గుర్తు చేసిన కేసీఆర్...సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల వల్లే తమదగ్గర భవిష్యత్ అవసరాలకు సరిపోయే ప్రాజెక్టులు లేవని విమర్శించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తాము రైతులకు నష్టపరిహారం చెల్లించామని ఆయన గుర్తు చేశాం. సమైక్యరాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఇవ్వను పో అంటూ అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మొహం పట్టుకొని చెప్పినా తామేమీ చేయలేకపోయామని...అలాంటి సంఘటనలే తెలంగాణ వచ్చేలా చేశామని కేసీఆర్ గుర్తుచేశారు.
సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రాజెక్టులు తన వ్యక్తిగత ప్రయోజనం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
భూసేకరణ బిల్లును ప్రధానమంత్రితో చర్చించాకే రూపొందించామని, దీని వల్ల ఏ రైతుకు ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మారాలని, వాళ్లు సృష్టించే అడ్డంకులు అధిగమించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి...జలకళతో తెలంగాణను పచ్చగా మారుస్తామని, వచ్చే యేడాది చివరికల్లా పంటలు పండించి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు.
అసెంబ్లీలో 2013 భూసేకరణ సవరణ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో కేసీఆర్ పాల్గొన్నారు. భూ సేకరణ చేపట్టకుంటా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టులు కట్టలేదని గుర్తు చేసిన కేసీఆర్...సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాల వల్లే తమదగ్గర భవిష్యత్ అవసరాలకు సరిపోయే ప్రాజెక్టులు లేవని విమర్శించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తాము రైతులకు నష్టపరిహారం చెల్లించామని ఆయన గుర్తు చేశాం. సమైక్యరాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఇవ్వను పో అంటూ అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మొహం పట్టుకొని చెప్పినా తామేమీ చేయలేకపోయామని...అలాంటి సంఘటనలే తెలంగాణ వచ్చేలా చేశామని కేసీఆర్ గుర్తుచేశారు.
సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రాజెక్టులు తన వ్యక్తిగత ప్రయోజనం కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.