యాప్నగరం

టోలిచౌకి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అపశృతి.. వ్యక్తి మృతి

ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. క్రేన్ బోల్తాపడి ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనతో టోలిచౌకి, గచ్చిబౌలి మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

Samayam Telugu 2 Jul 2019, 4:42 pm
హైదరాబాద్ నగరంలోని టోలిచౌకిలో ఫైఓవర్‌ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. క్రేన్‌ బోల్లా పడిన ఘటనలో ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. టోలిచౌకిలోని షేక్‌పేట వద్ద మంగళవారం (జులై 2) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రహదారిపై భారీ క్రేన్ బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Samayam Telugu shaikpet
క్రేన్ బోల్తా


పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. టోలిచౌకి - గచ్చిబౌలి రహదారిని మూసివేసి క్రేన్‌ను పక్కకు తొలగించే పనులు చేపట్టారు. ఫ్లైఓవర్‌ గ్రిడ్‌ను లిఫ్ట్‌ చేస్తుండగా క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఘటనాస్థలిని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ వచ్చి పరిశీలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.