ఏపీ సర్కార్, కేంద్రంపై మధ్య మరో వివాదం మొదలయ్యింది. అమరావతిలో కేంద్ర సంస్థల నిర్మాణాలపై....సంబంధిత శాఖలకు సీఆర్డీఏ నోటీసులు పంపడం హాట్టాపిక్ అయ్యింది. రాజధానిలో కేటాయించిన భూముల్లో భవనాల నిర్మాణం చేపట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా భవనాలను కట్టలేదని... తీసుకున్న భూముల్ని వెనక్కు ఇచ్చేయాలని ప్రస్తావించింది. సెంట్రల్ యూనివర్శిటీ, ఎఫ్సీఐ. పోస్టల్, ఎల్ఐసీ సహా మరికొన్ని సంస్థల ఏర్పాటు కోసం ల్యాండ్ను సీఆర్డీఏ కేటాయించింది.
కేంద్రం తీసుకున్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం వల్లే నోటీసులు పంపామన్నారు మంత్రి నారాయణ. నిబంధనల ప్రకారం మూడు నెలలలోపే భవనాలను కట్టాలని... కాని ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. అలాగే భూములకు కూడా డబ్బు చెల్లించలేదన్నారు మంత్రి. మరి ఈ నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
కేంద్రం తీసుకున్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం వల్లే నోటీసులు పంపామన్నారు మంత్రి నారాయణ. నిబంధనల ప్రకారం మూడు నెలలలోపే భవనాలను కట్టాలని... కాని ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. అలాగే భూములకు కూడా డబ్బు చెల్లించలేదన్నారు మంత్రి. మరి ఈ నోటీసులపై కేంద్రం ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.