అక్రమంగా 125 క్రెడిట్ కార్డుల ద్వారా కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ హైదరాబాద్ నిందితుల బాగోతం బయటపడింది. హవాలా, క్రెడిట్ కార్డుల పేరుతో పెద్ద ఎత్తున మోసం చేసిన 9 మంది సభ్యుల ముఠాను గురువారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి ససంబంధించిన వివరాలను హైదరాబాద్ ఇన్చార్జ్ పోలీస్ కమీషనర్ కే రంగారెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రధాన బ్యాంకులను రూ. 1.5 కోట్ల మేర మోసం చేసినట్లు తాము గుర్తించామని వివరించారు. నిందితుల నుంచి పలు క్రెడిట్,డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి ఎం.నరేష్, ఓటరు గుర్తింపు కార్డు ఏజెంటు వి.శ్రీకాంత్, హెచ్డీఎఫ్సీ ఉద్యోగి జి.కిషోర్ బాబు, పాక్ర్ కన్సల్టెన్సీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, హెచ్డీఎఫ్సీ క్రెడిట్²కార్డు దరఖాస్తు వెరిఫికేషన్ ఏజెంటు జి.శైలేష్ కుమార్, ఇన్నోవ్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగి ఆర్ సందీప్ కుమార్, వెరిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ యూ ఆనంద్, ఎమ్ పరమేష్ ఉన్నారు. వీరంతా నగరంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం రంగా రెడ్డి పర్ణిక నానో సిస్టమ్స్ పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేశాడు. తర్వాత రంగారెడ్డి, సంతోష్ రెడ్డి నకిలీ ఐడీలను సృష్టించారు. వాటిని ఉపయోగించి వి శ్రీకాంత్, నరేష్ కలిసి 48 ఓటరు ఐడీ కార్డులు, తర్వాత పాన్ కార్డులను తయారుచేయగలిగారు. తద్వారా ఎస్బీఐ, స్టాండర్డ్ చార్టర్ట్ బ్యాంకుల్లో వరుసగా రూ.25, రూ.77 లక్షల మోసాలకు పాల్పడ్డారు. ఆడిట్ సమయంలో రంగా రెడ్డి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా క్రెడిట్ కార్డులను సృష్టించి బ్యాంకులను మోసం చేశాడని గుర్తించారు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం రంగా రెడ్డి పర్ణిక నానో సిస్టమ్స్ పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేశాడు. తర్వాత రంగారెడ్డి, సంతోష్ రెడ్డి నకిలీ ఐడీలను సృష్టించారు. వాటిని ఉపయోగించి వి శ్రీకాంత్, నరేష్ కలిసి 48 ఓటరు ఐడీ కార్డులు, తర్వాత పాన్ కార్డులను తయారుచేయగలిగారు. తద్వారా ఎస్బీఐ, స్టాండర్డ్ చార్టర్ట్ బ్యాంకుల్లో వరుసగా రూ.25, రూ.77 లక్షల మోసాలకు పాల్పడ్డారు. ఆడిట్ సమయంలో రంగా రెడ్డి నకిలీ డాక్యుమెంట్ల ద్వారా క్రెడిట్ కార్డులను సృష్టించి బ్యాంకులను మోసం చేశాడని గుర్తించారు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.