యాప్నగరం

తెలుగురాష్ట్రాల్లో తీరనున్న నగదు కొరత?

నగదు కొరత కష్టాలు గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

TNN 18 Mar 2017, 9:11 am
నగదు కొరత కష్టాలు గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కాగా ప్రజలకు ఆ కష్టాలు అతి త్వరగా తీరనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల కోసం రూ.1800 కోట్ల రూపాయల నగదును పంపించిందని సమాచారం. శుక్రవారం నగదు ముంబై నుంచి హైదరాబాద్ ఆర్ బీఐకి చేరిందట. అందులో రూ.700 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి, వెయ్యి కోట్లు ఆంధ్రప్రదేశ్ కు సరఫరా చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఆ డబ్బు ఏటీఎంలలోకి చేరితే ఇక ప్రజల కష్టాలు తీరినట్టే. నగదును శనివారమే హైద్రాబాద్ లోని పలు బ్యాంకులకు పంపనున్నారట. అలాగే మిగతా జిల్లాలకు కూడా పంపించనున్నారు. సిటీ ప్రజలకు శనివారం సాయంత్రం నుంచి ఏటీఎంలలోడబ్బులు లభించే అవకాశం ఉంది.
Samayam Telugu currency troubles to end in telugu states
తెలుగురాష్ట్రాల్లో తీరనున్న నగదు కొరత?


జాతీయ బ్యాంకులలో నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంలకు డబ్బులు చేరలేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రిజర్వ్ బ్యాంకు అవసరానికి సరిపడా నగదును బ్యాంకులకు పంపించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీనిపై తెలంగాణ సీఎస్ ఆర్ బీఐ అధికారులతో మాట్లాడారు. ఆర్ బీఐ ఉన్నతాధికారులు నగదును తెలుగు రాష్ట్రాలకు పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.