యాప్నగరం

ఏపీకి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న 'గజ'

ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తున్న మరో ముప్పు.. గజ రూపంలో దూసుకొస్తున్న తుఫాన్.. ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.

Samayam Telugu 11 Nov 2018, 5:34 pm
తిత్లీ నుంచి తేరుకునేలోపే మరో తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రం వైపుగా దూసుకొస్తోంది. ఇది నెల్లూరు జిల్లా శ్రీహరి కోటను 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ వాయు గుండం తీవ్ర తుఫాన్‌గా మారి.. ఈ నెల 15న తమిళనాడు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Samayam Telugu gaja


ఈ తుఫాన్‌కు 'గజ'గా పేరు పెట్టగా.. దీని ప్రభావం ఏపీతో పాటూ తమిళనాడుపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఈ నెల 14 నుంచి 17 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే గజ ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు.సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పరిస్థితిని బట్టి కంట్రోల్ రూమ్‌లు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.