యాప్నగరం

‘పెథాయ్’ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుంది!

మొదటినుంచీ అంచనా వేసినట్లుగానే తూర్పు, ఈశాన్య తెలంగాణలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 16 Dec 2018, 7:27 pm
ఆంధ్రప్రదేశ్‌వైపు దూసుకెళ్తున్న ‘పెథాయ్‌’ తుఫాను సోమవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం విశాఖపట్నం-కాకినాడల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తుఫాను ప్రభావం తెలంగాణలో ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. పెథాయ్ ప్రభావం కారణంగా ఈనెల 18న తెలంగాణలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.
Samayam Telugu Phethai


మొదటినుంచీ అంచనా వేసినట్లుగానే తూర్పు, ఈశాన్య తెలంగాణలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఏపీతో పోల్చితే తెలంగాణకు ఎలాంటి ముప్పు లేదన్నారు. ప్రస్తుతం పెథాయ్ తుఫాను ఈశాన్య దిశగా శ్రీకాకుళం, కాకినాడవైపు కదులుతోందని చెప్పారు. గుంటూరు, గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలపై పెథాయ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

కాగా, ఏపీలో మంత్రులు, అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. నిత్యావసర సరకులు అన్నీ అందుబాటులో ఉంచామని సంబంధిత ప్రాంతాల అధికారులు చెబుతున్నారు. పెథాయ్ తుఫాను నేపథ్యంలో హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం వెంబడి అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.