విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులుదీరారు. కాగా ఈ రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గదేవీగా దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఇంద్రకీలాద్రితో పాటు రాష్ట్రంలోని పలు దేవాలయాలు ఉదయం నుంచి కళకళలాడుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి విగ్రహాలను సుందరంగా అలంకరించారు. కాగా అమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తులు బారులుదీరారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది.
TNN 1 Oct 2016, 11:22 am