యాప్నగరం

కుటుంబ వివాదం.. అత్తను కడతేర్చిన కోడలు

ఇంట్లో మొదలైన చిచ్చు.. తరచూ గొడవపడుతున్న అత్తాకోడళ్లు.. చివరికి అత్తను దారుణంగా హతమార్చిన కోడలు..

Samayam Telugu 4 Nov 2018, 3:43 pm
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబంలో మొదలైన చిచ్చు హత్యకు దారి తీసింది. అత్తపై కోపం పెంచుకున్న కోడలు.. కిరాతకంగా హత్య చేసింది. ఇరగవరం మండలం రేలంగికి చెందిన మహాలక్ష్మి.. నారాయణీదేవిలు అత్తాకోడళ్లు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండుమూడుసార్లు కుటుంబ సభ్యులు సర్థిచెప్పడంతో వివాదం ముగిసింది. ఇంట్లో చేయాల్సిన పని విషయంలో శనివారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది.
Samayam Telugu Murder


అత్తపై కోపం పెంచుకున్న కోడలు.. ఎలాగైనా ఆమెను హతమార్చాలని స్కెచ్ వేసింది. అత్త మహాలక్ష్మి మొహంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అత్త తీరుతో విసిగిపోయి హత్యకు పాల్పడినట్లు కోడలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో చెబుతామంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.