యాప్నగరం

వరంగల్ చేరిన శరత్ మృతదేహం.. సాయంత్రం అంత్యక్రియలు

అమెరికాలో ఉన్మాది కాల్పులకు బలైన వరంగల్ విద్యార్థి శరత్ మృతదేహం వరంగ‌ల్‌కు చేరింది. విగతజీవిగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Samayam Telugu 12 Jul 2018, 8:53 am
అమెరికాలో ఉన్మాది కాల్పులకు బలైన వరంగల్ విద్యార్థి శరత్ మృతదేహం వరంగ‌ల్‌కు చేరింది. విగతజీవిగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కుటంబానికి అండగా ఉంటాడనుకున్నవాడు ఇలా ప్రాణాలు లేకుండా తిరిగి వస్తాడని అనుకోలేదంటూ గుండెలవిశేలా ఏడ్చారు. శరత్‌ను నిర్జీవంగా పడి ఉన్న శరత్‌ను చూసిన స్నేహితులు కూడా కంటతడి పెట్టుకున్నారు. ఇటు రాజకీయ నేతలు కూడా బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. స్థానికంగా విషాద వాతావరణం కనిపించగా.. శరత్‌ అంత్యక్రియలను సాయంత్రం నిర్వహించనున్నారు.
Samayam Telugu Sharath..


నిన్నరాత్రి శరత్ డెడ్‌బాడీ అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వరంగల్‌కు తరలించేందుకు కూడా అధికారులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్ బయట శరత్ మృతదేహానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు నివాళులర్పించారు. ఎంతో భవిష్యత్ ఉన్న శరత్ ఇలా చనిపోవడం దురదృష్టకరమన్నారు.

శరత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. నగరలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. ఏడు నెలల క్రితం ఉద్యోగం మానేసి.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరి వర్శిటీలో ఎంఎస్ అభ్యసిస్తూ.. పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. గత శనివారం రెస్టారెంట్‌లో ఉండగా.. ఓ దుండగుడు అతడిపై కాల్పులు జరిపడంతో తీవ్రంగాయపడ్డాడు. అతడ్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.