యాప్నగరం

టీడీపీ ఎంపీల పోరాటానికి కేజ్రీవాల్ మద్దతు

ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. అరెస్టై పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఎంపీలను పరామర్శించిన ఆయన... వారి ఆందోళనకు మద్దతు పలికారు.

Samayam Telugu 8 Apr 2018, 2:47 pm
ఏపీ హక్కుల కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. ప్రధాని మోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నా తర్వాత ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ నివాసం దగ్గర నుంచి బస్సులో తరలించి... తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ నేరుగా పీఎస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీలను పరామర్శించిన ఆయన... వారికి సంఘీభావాన్ని తెలిపారు. కేంద్రంపై పోరాడుతున్న టీడీపీ ఎంపీలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు కేజ్రీ.
Samayam Telugu Kejriwal..


ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నవారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కేజ్రీవాల్. కనీసం ఎంపీలన్న గౌరవం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఏపీకి సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.