యాప్నగరం

ఢిల్లీ: టీడీపీ ఎంపీల ధర్నా.. శివప్రసాద్ కొత్త వేషం

ఢిల్లీ వేదికగా టీడీపీ ఎంపీల ఆందోళన. విభజన హమీలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో నిరసన. కొత్త వేషంలో ఎంపీ శివ ప్రసాద్.

Samayam Telugu 13 Dec 2018, 11:49 am
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసన తెలియజేశారు. గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలు ప్లకార్డులతో ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి.. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu tdp.


ఇక విచిత్ర వేషధారణలతో నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇవాళ మరో కొత్త గెటప్‌లో కనిపించారు. 'గారడి' వేషదారణలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగారు. పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు ఒకరైతే.. మోదీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేస్తారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్‌ ఫైరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.