కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని పోస్టీఫీసులపై సీబీఐ ఆకస్మికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టాఫీసులలో హిమాయత్ నగర్ తపాలా కార్యాలయం కూడా ఉంది. తనిఖీలలో హిమాయత్ నగర్ పోస్టాఫీసులో అవకతవకలు జరిగినట్టు సీబీఐ నిర్ధారించింది. దాదాపు రూ.40 లక్షల వరకు కమిషన్ పద్దతిలో చేతులు మారినట్టు నిర్ధారిచింది. సీనియర్ సూపరిటెండెంట్ సుధీర్ బాబు, పోస్టు మాస్టర్ రేవతి, సీనియర్ అసిస్టెంట్ రవితేజపై కేసు నమోదు చేశారు.
కేంద్రం పెద్ద నోట్లు రద్దయ్యాక పాతనోట్లను బ్యాంకులతో పాటూ, పోస్టాఫీసుల్లో కూడా మార్చుకోవచ్చని ప్రకటించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో కొత్త రెండువేల రూపాయల నోట్లను వివిధ పోస్టాఫీసులకు పంపింది. అలా వచ్చిన మొత్తాన్ని హిమాయత్ నగర్ పోస్టాఫీసు అధికారులు కొందరు కమీషన్ కు కక్కుర్తి పడి పక్కదారి పట్టించారు. కొందరికి పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి చేసి... కొంత మొత్తాన్ని కమిషన్ గా తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు నలభై లక్షల రూపాయల దాకా చేసినట్టు సీబీఐ అధికారుల తనిఖీలో తేలింది.
కేంద్రం పెద్ద నోట్లు రద్దయ్యాక పాతనోట్లను బ్యాంకులతో పాటూ, పోస్టాఫీసుల్లో కూడా మార్చుకోవచ్చని ప్రకటించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో కొత్త రెండువేల రూపాయల నోట్లను వివిధ పోస్టాఫీసులకు పంపింది. అలా వచ్చిన మొత్తాన్ని హిమాయత్ నగర్ పోస్టాఫీసు అధికారులు కొందరు కమీషన్ కు కక్కుర్తి పడి పక్కదారి పట్టించారు. కొందరికి పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి చేసి... కొంత మొత్తాన్ని కమిషన్ గా తీసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు నలభై లక్షల రూపాయల దాకా చేసినట్టు సీబీఐ అధికారుల తనిఖీలో తేలింది.