మరో వ్యక్తి క్యూలైన్లో ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎస్ బీఐ బ్యాంకు వద్ద బాలరాజు అనే వ్యక్తి క్యూలైన్లో నిల్చున్నాదడు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చాడు. పశువైద్యుడిగా పనిచేసి రిటైరయ్యాడు.. లైనులో నిల్చున్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. తెలిసిన సమాచారం మేరకు క్యూలైను దగ్గరే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.
నోట్ల రద్దు అనంతరం ఏటీఎం ఎదుట, బ్యాంకుల ఎదుట క్యూలైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటివరకు 50కి పైగా సామాన్యులు, 11 మంది బ్యాంకు సిబ్బంది మరణించారు.
నోట్ల రద్దు అనంతరం ఏటీఎం ఎదుట, బ్యాంకుల ఎదుట క్యూలైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటివరకు 50కి పైగా సామాన్యులు, 11 మంది బ్యాంకు సిబ్బంది మరణించారు.