యాప్నగరం

చెక్కులతో చేపలు కొనే పద్ధతి లేదు: కేసీఆర్

అన్ని రూపాల్లో ఉన్న నల్లధనాన్ని అరికట్టాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.

TNN 28 Nov 2016, 7:49 pm
అన్ని రూపాల్లో ఉన్న నల్లధనాన్ని అరికట్టాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రాల ప్రమేయం లేదని స్పష్టం చేసారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గంటపాటు ఫోన్‌లో మాట్లాడానని, ప్రజల ఇబ్బందులు, సూచనలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు కేసీఆర్ చెప్పారు.
Samayam Telugu demonetization telangana cm kcr support cashless transactions
చెక్కులతో చేపలు కొనే పద్ధతి లేదు: కేసీఆర్


ప్రధానంగా నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాలని ప్రధానికి విన్నవించినట్లు కేసీఆర్ వెల్లడించారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీలు ఇక్కడ చాలా తక్కువని, చెక్కులతో చేపలు కొనే పద్ధతి ఇక్కడ లేదని చమత్కరించారు. గతంలో మొబైల్ ఫోన్ అంటే ఎవరికీ తెలియదనీ, ఇప్పుడు పశువుల కాపరి కూడా ఫోన్‌లు వాడుతున్నారని చెప్పారు.

ఏ రాష్ట్రంలో అయితే బ్యాంకుల ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయో అక్కడ అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. తెలంగాణలో కూడా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరగాలన్నారు. ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రజల వెంటే ఉందని భరోసా ఇచ్చారు. త్వరలో టీఎస్ వాలెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.