యాప్నగరం

ప్రగతి నివేదన సభ ఓ చరిత్ర: డిప్యూటీ సీఎం కడియం, కేకే

నీతి, నిజాయితీతో కేసీఆర్‌ పాలన అందిస్తున్నారని కొనియాడారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. సంక్షేమ పథకాలతో రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ అగ్రగామిగా ఉండాలంటే కేసీఆర్‌ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని కోరారు డిప్యూటీ సీఎం.

Samayam Telugu 2 Sep 2018, 9:10 pm
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారని ప్రగతి నివేదన సభలో వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, కంటి వెలుగు కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాక.. చెప్పనవి కూడా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందంటే.. అది సీఎం కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైందన్నారు.
Samayam Telugu Kadiam


పేద విద్యార్థుల కోసం వందల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు కడియం. నీతి, నిజాయితీతో కేసీఆర్‌ పాలన అందిస్తున్నారని కొనియాడారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాక.. ప్రగతి నివేదన సభ ద్వారా చరిత్ర సృష్టించామన్నారు. తెలంగాణ అగ్రగామిగా ఉండాలంటే కేసీఆర్‌ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని కోరారు డిప్యూటీ సీఎం.

నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహించామన్నారు టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు. సీఎం కేసీఆర్‌.. స్వర్ణ తెలంగాణను స్వర్గ తెలంగాణగా మారుస్తారని ప్రజలు నమ్ముతున్నారన్నారు. టీఆర్ఎస్‌కు నిజాయితీ ఉంది కాబట్టే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తోందన్నారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని.. మరో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటే.. స్వర్ణ తెలంగాణ స్వర్గ తెలంగాణ అవుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.