యాప్నగరం

ఢిల్లీకెళ్లి మద్దతు కూడగట్టక ఇక్కడ బురద జల్లుడెందుకు పవన్: కేఈ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దీటుగా బదులిచ్చారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్.. ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

Samayam Telugu 19 Mar 2018, 9:11 pm
అవినీతి ఆరోపణలను ఆధారాలతో పాటు రుజువు చేస్తే చర్యలు తీసుకునే ధైర్యమున్న ప్రభుత్వం తమదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సోమవారం (మార్చి 19) సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. పోలవరంలో జరిగిన అవినీతి ఏంటో పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని కేఈ అన్నారు. రాష్ట్రానికి ఏమైనా చేయదలుచుకుంటే ఢిల్లీకి వెళ్లి చేయాలని పవన్ కు సూచించారు.
Samayam Telugu ke
కేఈ కృష్ణమూర్తి ..


‘అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్.. ఢిల్లీకి వెళ్లకుండా ఇక్కడే ఎందుకు ఉన్నారు. హోదాపై మాట మారుస్తూ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు. ఢిల్లీలో చర్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ ఎందుకు ఆలోచన చేస్తున్నారు’ అని కేఈ ప్రశ్నించారు.

మూడు నెలలకోసారి వచ్చి బురద జల్లుడు కార్యక్రమాలు చేయడం పవన్ కు సరికాదని కేఈ హితవు పలికారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో చెల్లవన్నారు. అధికారంలో లేని వాళ్ల సలహాలు తీసుకుంటే పవనే నష్టపోతారని అన్నారు. నిధులు ఇవ్వని కారణంగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని తెలిపిన కేఈ.. రాష్ట్రాన్ని కేంద్రం మరింత ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.