భాగ్యనగరం వేదికగా వైభవోపేతంగా ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ రెండో రోజు కొనసాగుతున్నాయి. శనివారం (డిసెంబర్ 16) ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా జరుగుతున్న బృహత్ కవి సమ్మేళనంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ కంటే తెలుగు భాషలో మాట్లాడటం, నేర్చుకోవడం సులభమని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాతే తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగేనని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 12వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయడం మంచి పరిణామం అని ఆయన కొనియాడారు.
ఉర్దూ కంటే తెలుగే సులభం: మహమూద్ అలీ
భాగ్యనగరం వేదికగా వైభవోపేతంగా ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ రెండో రోజు కొనసాగుతున్నాయి. శనివారం (డిసెంబర్ 16) ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా జరుగుతున్న బృహత్ కవి సమ్మేళనంలో ఉపముఖ్యమంత్రి మహముద్ అలీ పాల్గొన్నారు.
TNN 16 Dec 2017, 6:37 pm