యాప్నగరం

ఘనంగా పెద్దగుట్ట లింగమతుల జాతర

తెలంగాణలో పెద్దగుట్ట లింగమతుల జాతర ఘనంగా జరుగుతోంది. చివ్వెంల మండలం దూరాజ్‌పల్లికి భారీగా భక్తులు వస్తున్నారు.

Samayam Telugu 13 Feb 2017, 11:06 am
తెలంగాణలో పెద్దగుట్ట లింగమతుల జాతర ఘనంగా జరుగుతోంది. చివ్వెంల మండలం దూరాజ్‌పల్లికి భారీగా భక్తులు వస్తున్నారు. కేసారం నుంచి దేవరపెట్టెను పార్ల శేర్లయ్య గుట్టకు పూజారులు తరలించారు. కేసారంలో ఆదివారం యాదవులకు మంత్రి జగదీశ్‌రెడ్డి దేవరపెట్టెను అందజేయడంతో జాతర ప్రారంభమైంది.
Samayam Telugu devotees throng pedda gutta lingamatula jatara in telangana
ఘనంగా పెద్దగుట్ట లింగమతుల జాతర


రెండు సంవత్సరాలకు ఒకసారి ఐదు రోజుల పాటు లింగమతుల జాతర జరుగుతుంది. ఈ జాతరలో ప్రధానంగా శివుణ్ని పూజిస్తారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. ఈ జాతరకు తెలంగాణ నుంచేగాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక నుంచి భక్తులు తరలివస్తున్నారు.

జాతరకు దాదాపు 30 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. పెద్ద పండుగ కావడంతో యాదవులు, గొల్ల, కురమలు తరలివస్తున్నారు. లింగమతుల జాతరకు పలు చోట్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. సూర్యాపేట పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పొట్టి శ్రీరాములు సెంటర్, సూర్యాపేట-ఖమ్మం క్రాస్‌రోడ్డు, జమ్మిగడ్డ నుంచి బస్సులు నడుస్తున్నాయి.


లింగమతుల జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, భక్తులకు భద్రత కల్పించేందుకు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దగట్టు మర్రిచెట్టు వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 50 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. లింగమతుల జాతరలో తొలిసారిగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే టోల్‌ఫ్రీ నెంబర్ 1033, ఆరోగ్యపరమైన అత్యవసర సాయం కోసం 108 కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.