యాప్నగరం

ముగిసిన ధర్మపోరాట దీక్ష: పవన్‌కు బాబు చురకలు!

రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయాలని డిమాండు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో తలపెట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ ముగిసింది.

Samayam Telugu 20 Apr 2018, 9:33 pm
రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయాలని డిమాండు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో తలపెట్టిన ‘ధర్మపోరాట దీక్ష’ ముగిసింది. ఇద్దరు చిన్నారులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిరాహార దీక్ష చేశారు.
Samayam Telugu pawan-kalyan-chandrababu-Naidu-collage


దీక్ష విరమణ తర్వాత చంద్రబాబు విజయం శంఖం పూరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం ఏపీకి మాత్రం ప్యాకేజీ ఇస్తామని అంటుందని అన్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు కాగా.. కేంద్రం రూ.4 కోట్లు మాత్రమే ఇస్తామంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కు కూడా చురకలు అంటించారు. ‘‘రాష్ట్రం కోసం దీక్ష చేపడితే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత సమస్యలపై స్పందనకు ఈరోజే సరైన రోజా? రేపు చేయొచ్చు కదా? వ్యక్తిత్వాలను హననం చేసే పనులను టీడీపీ ఎప్పుడూ చేయదు. అలాంటి చరిత్ర మాకు లేదు. రాకీయాల్లోకి రాని వాళ్లు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నోటికి హద్దు లేకుండా పోతోంది’’ అని తెలిపారు.

సీఎం ధర్మ పోరాట దీక్షాలో సినీ ప్రముఖులు బాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, రాఘవేంద్రరావు, అశ్వీనిదత్‌, నటుడు శివాజీ పాల్గొని మద్దతు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.