యాప్నగరం

ఈ దీక్షలు వేస్ట్.. వేదికపై జేసీ సంచలనం, సీఎం షాక్!

సంచలనానికి మారుపేరైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 25 Aug 2018, 7:01 pm
సంచలనానికి మారుపేరైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. కర్నూలులో శనివారం (ఆగస్టు 25) నిర్వహించిన ‘టీడీపీ ధర్మపోరాట సభ’కు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. అనంతరం జేసీ మాట్లాడారు. కొంత మంది నేతలు చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారని జేసీ అన్నారు. అసలు ధర్మపోరాట దీక్షల వల్ల ప్రయోజనమే లేదని, కేంద్రం చేసిన ద్రోహం గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu jc


కేంద్రంపై ఎన్ని పోరాటాలు చేసినా దున్నపోతు మీద వాన కురిసినట్టేనని జేసీ అన్నారు. చిల్లి చిప్పతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. చేతికి ఎముక లేదన్నట్లు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. అయితే ధర్మ పోరాట దీక్షల పేరుతో ఎంతసేపూ మోదీ ప్రభుత్వాన్ని తిడితే.. పథకాలతో లబ్ది పొందిన ప్రజలు వాటిని మరిచిపోతారని అన్నారు. వాటన్నిటికంటే అందరికీ నీళ్లిస్తే సరిపోతుందని తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తాడన్న నమ్మకం లేదంటూ జేసీ మరో సంచలనానికి తెరతీశారు. తనకు పదవులపై ఆశలేదని చెప్పారు. ఈ ధర్మ పోరాట సభలన్నీ నిరూపయోగమని గతంలోనే చెప్పానని గుర్తు చేసిన జేసీ.. రాష్ట్ర ప్రజలు మహాత్మా గాంధీని, కాటన్‌ దొరను, చంద్రబాబును మరిచిపోలేరంటూ తన ప్రసంగాన్ని ముగించారు. జేసీ వ్యాఖ్యలకు సభలో నవ్వులు విరియగా.. వేదికపై ఉన్న చంద్రబాబు సహా నేతలంతా అవాక్కయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.