యాప్నగరం

నేను ఎవర్నీ వేధించలేదు.. ఇదంతా రాజకీయ కుట్ర: డీఎస్ కుమారుడు సంజయ్

తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందంటున్నారు టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్. తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన స్పందించారు.

Samayam Telugu 3 Aug 2018, 7:14 pm
తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందంటున్నారు టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్. తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని.. శాంకరి నర్సింగ్ కాలేజీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ కాలేజీని వేరేవాళ్లకు ఇచ్చేశామని.. అక్కడి అడ్మిషన్ల వ్యవహారం కూడా తనకు తెలియదన్నారు. తాను ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగా విద్యార్థినిలతో అలా చెప్పించారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతోందని.. పోలీసుల విచారణకు కూడా సహకరిస్తానని చెప్పారు సంజయ్.
Samayam Telugu Sanjay


సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరీ మహిళా నర్సింగ్ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థినులు ఆరోపించారు. గురువారం పీవోడబ్ల్యూ నేత సంధ్యతో కలిసి 11 మంది విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాంకరీ కలేజీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. ప్రిన్సిపాల్ లేని సమయంలో తమను గదికి రావాలంటూ వేధిస్తున్నారని బాధిత విద్యార్థులు ఆరోపించారు. విచారణ చేపట్టి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందించిన హోంమంత్రి నాయిని విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని ఆయన ఆదేశించినట్లు సమాచారం. తనపై ఆరోపణలు రావడంతో సంజయ్ ఇవాళ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.