యాప్నగరం

కేసీఆర్ సర్కారుకి తలనొప్పిగా మారిన ప్రకటనలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతు బంధు, కంటి వెలుగు పథకాల ప్రకటనలు కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారాయి.

Samayam Telugu 20 Aug 2018, 10:05 am
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన రైతు బంధు, కంటి వెలుగు పథకాల ప్రకటనలు కేసీఆర్ సర్కారుకు తలనొప్పిగా మారాయి. రెండు ప్రకటనల్లోనూ ఒకే మహిళ ఉండటం, ఆమె భర్త స్థానంలో ఉన్న వ్యక్తులు మారడం వివాదాస్పదమైంది. ఈ ప్రకటనలు పచ్చటి కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. పత్రికల్లో వచ్చిన ఈ యాడ్‌లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రకటనలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో.. సర్కారు యాడ్ ఏజెన్సీలకు నోటీసులు పంపింది.
Samayam Telugu adv


ఈ ప్రకటన కోసం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నాగరాజు పద్మ దంపతులు ఫొటోలను తీసుకున్నారు. వారు బొంతలు కుట్టి జీవనం సాగిస్తారు. లోన్ ఇప్పిస్తామని చెప్పి వారి ఫొటోలు తీసుకుని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రకటనల్లో వాడుకున్నారు. రైతు బంధు పథకంలో ఈ ఫొటో వాడినప్పటికీ.. నాగరాజు కుటుంబానికి అసలు వ్యవసాయ భూమే లేదు.

ఈ ప్రకటనలు తమ కాపురంలో కలతలు రేపాయని నాగరాజు దంపతులు వాపోయారు. వారు ఆదివారం కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.