విశాఖ - విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమహేంద్రవరం నుంచి తాడేపల్లి వెళ్తున్న ఓ ఇసుక లారీ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై మరో లారీని ఢీకొనడంతో రైల్వే విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ..విద్యుత్ తీగల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. మరమ్మతుపనులు పూర్తయ్యే వరకు విశాఖ-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
విశాఖ- విజయవాడ రైళ్ల రాకపోకలకు అంతరాయం
రోడ్ కమ్ బ్రిడ్జ్ పై రెండు లారీలు పరస్పరం ఢీకొనడంతో రైల్వే విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
TNN 25 Oct 2016, 12:15 pm