యాప్నగరం

హరికృష్ణ మృతి కలిచివేసింది: డీఎంకే అధినేత స్టాలిన్

నందమూరి హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు డీఎంకే అధినేత స్టాలిన్. గురువారం డీఎంకే తరపున టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు.

Samayam Telugu 30 Aug 2018, 12:00 pm
నందమూరి హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు డీఎంకే అధినేత స్టాలిన్. గురువారం డీఎంకే తరపున టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఓ లేఖ రాశారు. టీడీపీ సీనియర్ నేత.. చంద్రబాబు గారి బావమరిది హరికృష్ణ మరణం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు స్టాలిన్. ఈ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యాయనని.. నందమూరి, నారా కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నానన్నారు స్టాలిన్.
Samayam Telugu Stalin.


వాస్తవానికి చంద్రబాబు గురువారం చెన్నై వెళ్లాల్సి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంతాప సభకు హాజరు కావాల్సి ఉంది. కాని హరికృష్ణ మృతితో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. చంద్రబాబుకు బదులుగా చెన్నై పర్యటనకు కేంద్ర మాజీమంత్రులు అశోకగజపతిరాజు, సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌‌లు చెన్నై వెళ్ళనున్నారు. వారు కరుణానిధి సంతాప సభలో పాల్గొనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.