యాప్నగరం

Jagga Reddy: కేసీఆర్‌, ఆయన కుటుంబాన్ని తిట్టను..

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 12 Dec 2018, 9:48 pm
నను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. రాజకీయ కక్షలు తన నియోజకవర్గంలో ఉండవని తెలిపారు. బుధవారం (డిసెంబర్ 12) సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. 2014లో సెంటిమెంట్ వల్ల ఓడిపోయానని తెలిపారు.
Samayam Telugu jaggu


‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా నాలుగేళ్ల వరకు ప్రభుత్వంపైనా, కేసీఆర్ మీద, వారి కుటుంబ సభ్యుల పైనా ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయను. సమస్యలను ఉత్తరాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా’ అని జగ్గారెడ్డి అన్నారు.

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటింటికి మంజీర నీటి సరఫరా, విద్యా సంస్థల ఏర్పాటు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం అడుగుతానని జగ్గారెడ్డి తెలిపారు. ప్రభుత్వం తన ప్రతిపాదనలు తిరస్కరిస్తే.. సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తానని చెప్పారు.

చింత ప్రభాకర్ తనను రాజకీయంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేసి విఫలమయ్యాడని జగ్గారెడ్డి అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. కేసీఆర్‌ను అభినందిస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పురపాలక సంఘాల కాలపరిమితి ముగిసే వరకు.. కార్యాలయాలకు వెళ్లనని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మతాల వారు తనకు ఓటు వేసి గెలిపించారని, 17న సంగారెడ్డి నియోజకవర్గంలోని లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహిస్తానని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.