యాప్నగరం

YS Jagan: సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. జగన్ సంచలన నిర్ణయం

తన కాన్వాయ్‌తో సామాన్య ప్రజలు ఇబ్బందిపడటాన్ని గమనించారు. ఇకపై ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 6 Jun 2019, 6:42 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన పర్యటనల సందర్భంగా.. కాన్వాయ్‌తో సామాన్య ప్రజలు ఇబ్బందిపడటాన్ని గమనించారు. ఇకపై ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu convoy


విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్ గమనించారట. అలాగే పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా అక్కడక్కడా ఇలాంటి సమస్యే వెంటాడుతోందట. దీంతో ఎయిర్‌పోర్టుకు, పర్యటనలకు వెళ్లే సమయాల్లో.. తన కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బందులు లేకుడా.. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని పోలీసు, సీఎంవో అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారట.

ముఖ్యంగా జగన్ కాన్వాయ్‌తో విజయవాడలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీస్, భద్రతా అధికారులు ఫోకస్ పెట్టారట. ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉండే మార్గాలను పరిశీలిస్తున్నారట. జగన్ నిర్ణయంపై వైసీపీ నేతలతో పాటూ విజయవాడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.