యాప్నగరం

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం (ఆగస్టు 22) జారీచేసిన రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద కొనసాగుతుండడంతో ధవళేశ్వరం వద్ద నది నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.

Samayam Telugu 23 Aug 2018, 1:48 pm
ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద కొనసాగుతుండడంతో ధవళేశ్వరం వద్ద నది నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో బుధవారం (ఆగస్టు 22) జారీచేసిన రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్యారేజీలో నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గురువారం మధ్యాహ్నం 12.00 గంటల సమయానికి బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 14.21 లక్షల క్యూసెక్కులుగా, అవుట్‌ఫ్లో కూడా 14.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
Samayam Telugu dawaleswaram_0


గోదావరి ఉద్ధృతంగా ప్రవహించడంతో ఉపనదులైన వశిష్ఠ, వృద్ధ గౌతమి, వైనతేయి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పరివాహక గ్రామాల్లోకి వరద నీరు చేరిపోయింది. వేలేరుపాడు, కుక్కునూరు, ఆచంట, యలమంచిలి, పెరవలి మండలాల్లోని గ్రామాలను వరద ముంచెత్తుతోంది. కుక్కునూరు మండలం లుక్కీగూడెం, సీతారామనగరం, గుమ్ముగూడెం సమీపంలో వరద పోటెత్తుతోంది. రహదారులపై వరద ప్రవాహరించడంతో.. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.