యాప్నగరం

ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు

ఏసీబీ అధికారిణికి తప్పని వరకట్న వేధింపులు. అదనపు కట్నం తేవాలంటూ ప్రభావతికి భర్త, అత్తింటివారి వేధింపులు. పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు.

Samayam Telugu 5 May 2019, 7:51 pm
వరకట్న వేధింపుల గురించి తరచూ మనం వింటుంటాం.. ఏపీలో మాత్రం ఏకంగా ఏసీబీ (అవినీతి నిరోధకశాఖ)లో పనిచేసే మహిళా ఉద్యోగికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను అత్తింటివారు భర్త వేధిస్తున్నారు.. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.
Samayam Telugu acb


పిడిక్కాల ప్రభావతి విజయవాడ ఏసీబీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తులసీనగర్‌కు చెందిన ప్రభావతి.. శంకరశెట్టి కిరణ్‌‌ను ప్రేమించి 2018 నవంబర్‌లోపెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కాపురం సాఫీగా సాగిపోయినా.. మూడు నెలలుగా భర్తు, అత్తింటివారు ఆమెను వేధిస్తున్నారట.

భర్త కిరణ్ రూ.20లక్షల అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను వేధిస్తున్నారని ప్రభావతి ఆరోపించారు. మూడు నెలలుగా తాను మానసికంగా వేదనకు గురయ్యాయనని బాధితురాలు చెప్పారు. ఆదివారం ధైర్యం చేసి భర్త, అత్తింటిపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.