యాప్నగరం

హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా మెరుగు

శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు.

Samayam Telugu 22 Dec 2016, 11:18 am
శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నీటి సరఫరాను మెరుగుపరుస్తున్నాం. చెడిపోయిన పైప్‌లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామని’ ఆయన తెలిపారు.
Samayam Telugu drinking water sources increased in ghmcktr
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా మెరుగు


602 మిలియన్ గ్యాలన్ల చొప్పున జీహెచ్‌ఎంసీలో నీటి సరఫరా చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సిటీలో పూర్తి స్థాయి నీటి సరఫరా, కరెంటు 24గంటలు ఉంటుందని పేర్కొన్నారు. ‘ఓల్డ్ సిటీలో 9 లక్షల రెండు వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కోర్‌సిటీలో 991కి.మీ పైప్‌లైన్ మార్చాలని గతంలో నిర్ణయించాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1334 కి.మీ పైప్‌లైన్ మారుద్దామని నిర్ణయించామని’ తెలిపారు. పైప్‌లైన్ మరమ్మత్తుల కోసం హడ్కో నుంచి నిధులు తీసుకుంటున్నామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.