యాప్నగరం

డ్రైవర్‌ను ఢీకొన్న బస్సు.. యాదాద్రి డిపోలో విషాదం

ఆర్టీసీ బస్సు ఢీకొని డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. యాదగిరిగుట్ట బస్ డిపోలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Samayam Telugu 10 Jun 2019, 5:11 pm
యాదగిరిగుట్ట బస్ డిపోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. బస్సును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి బస్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జి. నరేశ్ (35) ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన మరో బస్సు వెనకాల ఉండగా.. ఆ బస్సు డ్రైవర్ అది గమనించకుండా బస్సును రివర్స్ చేశాడు. దీంతో బస్సు నరేశ్‌ను ఢీకొడుతూ వెనక్కి వెళ్లింది. ఈ ప్రమాదంలో నరేశ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు..
Samayam Telugu Yadadri
డ్రైవర్ నరేశ్


నరేశ్ స్వస్థలం రాజాపేట మండలం బొందుగుల గ్రామంగా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నరేశ్ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని అతడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.