యాప్నగరం

డ్రగ్స్ కేసు: డిసెంబర్ చివరి నాటికి ఛార్జ్‌షీట్లు

డ్రగ్స్ కేసులో డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ ఈడీ అకున్ సబర్వాల్..

TNN 18 Aug 2017, 3:43 pm
డ్రగ్స్ కేసు విచారణ చురుగ్గా సాగుతోందని ఎక్సైజ్ శాఖ ఈడీ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈ కేసులో డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని ఆయన మీడియాకు చెప్పారు. ‘సిట్ ఇప్పటి వరకు 11 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసింది. సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించి ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
Samayam Telugu drugs case charge sheets to be filed before december end
డ్రగ్స్ కేసు: డిసెంబర్ చివరి నాటికి ఛార్జ్‌షీట్లు


సినీ ప్రముఖులు సాక్షులా? నిందితులా? అనేది ఇప్పుడే చెప్పలేమని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. సినీ ప్రముఖుల విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. సామాజిక బాధ్యతతో డ్రగ్స్ దుష్పరిమాణాలను చెబుతున్నామని, డ్రగ్స్‌పై అవగాహన కల్పించడానికి విద్యాసంస్థలు స్పందిస్తున్నాయని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.