యాప్నగరం

మీడియాతో గొడవపడ్డ పూరి సోదరుడు!

డ్రగ్స దందాలో సిట్ ముందు విచారణకు హాజరైన పూరి జగన్నాథ్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తోంటే, మీడియా పడిగాపులు కాస్తోంది. అయితే పూరి సోదరుడు మాత్రం మీడియాపై వీరంగం వేశాడు.

TNN 19 Jul 2017, 2:29 pm
డ్రగ్స దందాలో సిట్ ముందు విచారణకు హాజరైన పూరి జగన్నాథ్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తోంటే, మీడియా పడిగాపులు కాస్తోంది. అయితే పూరి సోదరుడు మాత్రం మీడియాపై వీరంగం వేశాడు. రహస్యంగా జరుగుతున్న తన అన్న పూరీ జగన్నాథ్ విచారణ గురించి అందరికీ తెలియజేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సాయిరాం శంకర్ అబ్కారీ కార్యాలయంలో హంగామా సృష్టించాడు. అంతే కాదు మీడియా ప్రతినిధులపైకి దూసుకుపోయి, వారి మొబైల్స్ లాక్కొని వీడియోలను డిలీట్ చేశాడు. ఈ ఉదయం పూరీతోపాటు సోదరుడు సాయిరాం శంకర్, కుమారుడు ఆకాశ్ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. పూరీని మాత్రమే గదిలోకి తీసుకెళ్లిన అధికారులు, వీరిని బయటే నిలిపేశారు. ఆ సమయంలో తీసిన పలు వీడియోలు న్యూస్ చానెళ్ల ద్వారా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
Samayam Telugu drugs scandal director puri brother argued with media
మీడియాతో గొడవపడ్డ పూరి సోదరుడు!


పూరిని సిట్ అధికారులు విచారిస్తుంటే, అతడి తనయుడు ఆకాశ్‌తో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు అబ్కారీ కార్యాలయ సిబ్బంది పోటీ పడ్డారు. పలువురు ఆకాశ్‌ను కలుసుకుని అతడితో సెల్ఫీలు దిగారు. తనను పలకరించేందుకు వచ్చిన వారితో ఆకాశ్ సైతం ఉత్సాహంగా మాట్లాడినట్టు లంచ్ బ్రేక్ లో బయటకు వచ్చిన అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులతో కలసి కొద్దిసేపు బయటకు వచ్చిన ఆకాశ్, వారితో సెల్ఫీలు దిగడం మీడియా కంటబడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.