యాప్నగరం

వారం రోజుల్లో ఆ ఓట్లు తొలగిస్తాం: రజత్‌కుమార్

కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందుతుందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.

Samayam Telugu 13 Oct 2018, 10:51 pm
తెలంగాణ ఓటర్ల జాబితా సవరణకు భారీగా దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. 16 నియోజకవర్గాల్లో మూడు భాషల్లో ఓటర్ల జాబితా ముద్రిస్తున్నామని, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఓటర్ల జాబితా పూర్తి చేశామన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొన్ని పేర్లు పునరావృతం అయ్యాయని, వాటిని వారం రోజుల్లో తొలగిస్తామని తెలిపారు. ఈఆర్వో నెట్‌ అనే సాఫ్ట్‌వేర్ వినియోగంతో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశామని చెప్పారు. బోగస్‌ ఓట్ల తొలగింపునకు ఈ సాఫ్ట్‌వేర్‌ బాగా ఉపయోగపడిందని రజత్‌కుమార్ పేర్కొన్నారు.
Samayam Telugu Rajath Kumar


గత నెలలో దేశంలోని బస్సు ప్రమాదాల్లోనే అతిపెద్ద ఘటన కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల కుటుంబాలకు పరిహారం పంపిణీకి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో వ్యవహరించి కొండగట్టు బాధితులకు పరిహారం మంజూరును పరిశీలిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి విషయాన్ని వివరించి సాధ్యమైనంత త్వరగా నివేదిక తీసుకుంటామని చెప్పారు.

ఇప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలకు ఎన్నికల కోడ్ వల్ల ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. దసరా పండుగ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలంగాణలో పర్యటించనుందని వెల్లడించారు. కాగా, అక్టోబర్ 12న విడుదల చేసి జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,73,18,603 మంది ఓటర్లున్నారు. ఈసీ నుంచి అనుమతి రాగానే తుది జాబితా విడుదల చేసి వివరాలు వెల్లడిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.