యాప్నగరం

ఈసీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయి: ఉత్తమ్

ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమోనన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉందని ఉత్తమ్ అన్నారు

Samayam Telugu 11 Dec 2018, 4:10 pm
తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఈసీ, టీఆర్‌ఎస్ కుమ్మక్కైనట్లు తమకు అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నప్పుడు కేసీఆర్ చెప్పిన తేదీలకు కొంచెం అటూఇటూగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడం, ఓటర్ల జాబితాలో లక్షల పేరు మాయం కావడం, ఇలా అనేక కోణాల్లో తమకు అనుమానాలున్నాయన్నారు.
Samayam Telugu utthamkumarreddy


ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమోనన్న ఆందోళన తెలంగాణ ప్రజల్లో ఉందని ఉత్తమ్ అన్నారు. చాలాచోట్ల పోలైన ఓట్లకు, ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లకు చాలా తేడా ఉందని అన్నారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలంటే వీవీ ప్యాట్ చీటీలను సైతం లెక్కించాలని కోరినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకున్న అనుమానాలు తీరాలంటే వీవీ ప్యాట్ చీటీలు లెక్కించాలని.. అలాకాని పక్షంలో ఈ ఎన్నికలు తెలంగాణలోనే చీకటి అధ్యాయంగా నిలిచిపోతాయని ఉత్తమ్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.