యాప్నగరం

ప్రజలు తమ పక్కవారి గురించి పట్టించుకోకే..: ఇలా గాంధీ

లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ‘మహాత్మా గాంధీ మొబైల్ డిజిటల్ మ్యూజియం’ ప్రారంభమైంది. గాంధీజీ మనవరాలు ఇలా గాంధీ మంగళవారం (డిసెంబర్ 19) దీన్ని ప్రారంభించారు.

TNN 19 Dec 2017, 2:57 pm
లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ‘మహాత్మా గాంధీ మొబైల్ డిజిటల్ మ్యూజియం’ ప్రారంభమైంది. గాంధీజీ మనవరాలు ఇలా గాంధీ మంగళవారం (డిసెంబర్ 19) దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. డిజిటల్ మ్యూజియం ఆ దిశగా తోడ్పడుతుందని ఆమె తెలిపారు. గాంధీ సిద్ధాంతాల పట్ల చిన్నారులు, యువత ఆకర్షితమయ్యేలా మ్యూజియంలో ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు.
Samayam Telugu ela gandhi opens mahatma gandhi digital museum in hyderabad
ప్రజలు తమ పక్కవారి గురించి పట్టించుకోకే..: ఇలా గాంధీ


‘ప్రస్తుతం ప్రపంచమంతా అసమానత్వంతో నిండిపోయింది. ప్రజలు తమ పక్కవారి గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ప్రపంచం హింసతో నిండిపోయింది’ అని ఇలా గాంధీ అన్నారు. దక్షిణాఫ్రికాలో ఆమె ‘గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్’ను స్థాపించిన విషయం తెలిసిందే.

భావి తరాలకు మనం మంచి వారసత్వాన్ని అందించాలంటే.. గాంధీజీ సిద్ధాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ఇలా గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.