యాప్నగరం

‘రైతు బంధు’కు ఈసీ గ్రీన్ సిగ్నల్

రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Samayam Telugu 5 Oct 2018, 9:54 pm
తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వానికి రైతు బంధు పథకానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. బతుకమ్మ చీరల తరహాలోనే ప్రతిపక్షాలు మోకాలడ్డుతాయని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ భావించినా రైతుబంధుకు మార్గం సుగమమైంది. రైతు బంధు చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో రైతుబంధు చెక్కుల పంపిణీ సాధ్యమేనని ఈసీ పేర్కొంది. దాంతో పాటుగా రైతుల చేతికి నేరుగా చెక్కుల పంపిణీ చేయకూడదని ఈసీ సూచించింది.
Samayam Telugu Election Commission Of India


రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. కీలక షరతు ఏంటంటే.. కొత్త రైతులకు చెక్కులు పంపిణీగానీ, నగదు పంపిణీగానీ చేయకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ హెచ్చరించింది. మొదటిసారి రైతుబంధు చెక్ అందుకున్న రైతులకు మాత్రమే రెండో దఫా చెక్కుల పంపిణీని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పింది. వ్యవసాయ అధికారుల ద్వారా నేరుగా రైతులకు పంపిణీ చేయవద్దని హెచ్చరిస్తూ రైతుబంధుకు ఎన్నికల కమిషన్ అంగీకారం తెలిపింది.

అవకతవతకలు జరిగితే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించినట్లు సమాచారం. ఈ పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున సంవత్సరానికి రైతులకు రూ.8 వేలు ఇవ్వనుంది. తొలి దఫాలో 4వేలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, త్వరలో రెండో దఫా రూ.4వేలు అందజేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.