యాప్నగరం

ముందస్తుకు ఈసీ వేగం.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రద్దు

అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణకు ఈసీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈసీ వేగం పెంచింది.

Samayam Telugu 8 Sep 2018, 10:14 pm
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సవరణ ప్రక్రియను ఈసీ రద్దు చేసింది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే ముసాయిదాను కూడా విడుదల చేశారు. అయితే.. ఇది 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించారు. తాజాగా అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఈసీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ సవరణ ప్రక్రియను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం (సెప్టెంబర్ 8) ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ec


ప్రస్తుతం 2018 ఓటర్ల జాబితాకు సవరణ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 10) ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు.. దానిపై అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్‌ 8న తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. తుది జాబితాకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.

తెలంగాణ ఎన్నికల నిర్వహణ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిన ఈసీ.. అందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు సమకూర్చాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మంగళవారం (సెప్టెంబర్ 11) కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతపై ఈసీకి నివేదిక ఇవ్వనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.