యాప్నగరం

ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే..

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

TNN 7 Mar 2017, 8:25 pm
తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ పదవులకు మొత్తం 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్‌‌లో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, తెలంగాణలో ముగ్గురు ఏకగ్రీవంగా శాసనమండలికి ఎన్నికయ్యారు. మార్చి 8న నామినేషన్ల పరిశీలన అనంతరం వీటిని అధికారికంగా ప్రకటిస్తారు.
Samayam Telugu enormously elected mlcs in telugu states
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వీరే..


ఏపీలో 8వ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగుల ప్రభాకర్ రెడ్డి భార్య నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆ ఎన్నిక కూడా ఏకగ్రీమైంది. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థులు మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో.. టీడీపీ నుంచి నారా లోకేశ్‌, కరణం బలరాం, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్.. వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.